News
న్యాయం చేకూరేది ముఖ్యమంత్రి వల్లే
ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాపులకు న్యాయం చేకూరేది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వల్లేనని అన్నారు. శ్రీకాకుళంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డిపై ఆ పార్టీ ఎమ్మెల్యేలకు నమ్మకం పోయిందన్నారు. ఇప్పటికే ఇరవై మందికిపైగా ఎమ్మెల్యేలు వైసీపీని వీడారని, ఇంకా బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. రాష్ట్ర విభజన జరిగాక.. రాజధాని కూడా నిర్మించకూడదన్న లక్ష్యంతో జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. తుని సంఘటన జరగక ముందే ముద్రగడ పద్మనాభాన్ని భూమన కరుణాకరరెడ్డి కలిశారని చెప్పారు. ఆ తర్వాత సీఐడీ విచారణ జరిపి కరుణాకరరెడ్డితోపాటు పలువురిపై కేసులు నమోదు చేసిందన్నారు. కాపులకు జగన్ మద్దతు ఎంతమాత్రం అవసరం లేదన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








